ఆ ఆస్తులు స్వార్జితమో, పితృ ఆర్జితమో కాదు: వైఎస్ కుటుంబ ఆస్తుల గొడవపై ఎమ్మెల్యే నల్లమిల్లి

  • ఆస్తుల కోసం ఏ సీఎం పిల్లలు కూడా రోడ్డు మీద పడి కొట్టుకోలేదన్న నల్లమిల్లి
  • అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని విమర్శ
  • ఆ ఆస్తులను ఈడీ, సీబీఐ సీజ్ చేశాయని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. జగన్, ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మధ్య నెలకొన్న ఈ గొడవలపై బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పిల్లలు కూడా ఆస్తుల కోసం రోడ్డు మీద పడి కొట్టుకోలేదని ఎద్దేవా చేశారు. 

వీరు గొడవ పడుతున్న ఆ ఆస్తులు స్వార్జితమో, పితృ ఆర్జితమో కాదని నల్లమిల్లి అన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం తల్లి, పిల్లలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. పైగా ఆ ఆస్తులను ఈడీ, సీబీఐ సీజ్ చేశాయని చెప్పారు. అలాంటి ఆస్తుల కోసం వీరు కొట్టుకోవడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. వీళ్లు సంపాదించని, వీళ్లవి కాని ఆస్తుల కోసం గొడవ పడుతుండటంపై అందరూ చర్చించుకుంటున్నారని తెలిపారు.

Nallamilli Ramakrishna Reddy
BJP
Jagan
YS Sharmila

More Telugu News